బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్.. షాకిచ్చిన HYD పోలీసులు

-

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం తొలిసారిగా హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తలకు పోలీసులు షాకిచ్చారు.

- Advertisement -

బండి అభిమానులు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను, తోరణాలను పోలీసులు తొలగించారు. దీనిపై పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్‌పై కేసీఆర్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం? బీజేపీకి ఒక న్యాయమా? అంటూ ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులను నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఫ్లెక్సీలను తొలగిస్తున్న పోలీసులు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు పోలీసులు చెప్పారని నేతలు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....