బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్లంతా రేపిస్టులే: బండి సంజయ్

-

మంత్రి కేటీఆర్(KTR), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)కు మధ్య గతకొన్ని రోజులు సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఒకరి ట్వీట్ ఒకరు స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ(BJP) నేతలపై సంచలన ఆరోపణలు చేయగా.. దానికి బండి సంజయ్‌ స్పందించారు. బీఆర్ఎస్(BRS) పార్టీలో ఉండే నేతలంతా రేపిస్టులు, లైంగిక వేధింపులకు పాల్పడే వారని, బలత్కారం చేసే వారంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్విట్టర్ టిల్లుతో వేదికను పంచుకున్నారని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్‌ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ప్రభుత్వ విప్‌గా పదోన్నతులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ముగ్గురి ఆత్మహత్యలకు కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు, అత్మీయ సమ్మేళనంలో సన్మానం పొందారని దీనికి సంబంధించిన ఓ వార్తా కథనాన్ని సంజయ్(Bandi Sanjay) షేర్ చేశారు.

- Advertisement -

Read Also: తెలంగాణ బీజేపీలో ఫేక్ డాక్టర్లు ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...