BJP చీఫ్ బండి సంజయ్‌పై కేసు నమోదు

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌(Bandi Sanjay)పై కేసు నమోదు అయింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోపక్క.. బండి సంజయ్ కుమార్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఎమ్మెల్సీ కవితపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. ఆయనకు నోటీసులు జారీ చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్.. డీజీపీని విచారణకు ఆదేశించింది.

- Advertisement -
Read Also: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...