Chandrababu | టీడీపీ ఏర్పడింది తెలంగాణ గడ్డమీదే: చంద్రబాబు

-

Chandrababu | తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీ ఏర్పడిందని అన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అసలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ అని అన్నారు. హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కూడా టీడీపీదే అని అన్నారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Chandrababu | ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవడమే ఆ మహనీయుడు ఎన్టీఆర్‌కు మనం అందించే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే అని, దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో మౌళిక వసతులతో సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత కూడా టీడీపీదే అని అన్నారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభే సమాధానమని, ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తుందని సెటైర్లు వేశారు.

Read Also:

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...