Delhi Liquor Scam లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ

Delhi Liquor Scam

Delhi Liquor Scam |దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై ఈడీ సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించింది. తమ వాదనలను వినకుండా ఎలాంటి తీర్పును ప్రకటించొద్దని కోర్ట్ ను కోరుతూ.. కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. మార్చి 11 న విచారణను ఎదుర్కొన్న కవిత… మార్చి 16 న మరోసారి విచారణకు హాజరవ్వాలని ఆదేశించడంతో.. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం మహిళలను వారి ఇంట్లోనే విచారించాల్సిన ఈడీ.. చట్ట విరుద్ధంగా కార్యాలయానికి పిలుస్తున్నారని కవిత తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేసారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ వేగంగా  చేపట్టాలని కోరడంతో నిరాకరించిన సుప్రీమ్ కోర్ట్ మార్చి 24 విచారణ చేపడతామని స్పష్టం చేసింది.  మార్చి 20 న విచారణకు రావాలని కవితను ఆదేశించిన ఈడీ.

24 న కవిత తరపున న్యాయవాది వాదనలు, ఈడీ వాదనలు విన్న తర్వాత ఎలాంటి తీర్పును వెలువరిస్తో వేచి చూడాల్సిందే ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

Read Also: TSPSC పేపర్ లీక్ వ్యవహారం.. అభ్యర్థులకు కేటీఆర్ కీలక హామీ

Follow us on: Google News  Koo

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here