IPL బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

-

ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్(IPL Betting) ముఠా రెచ్చిపోతోంది. భారీగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. ఇదే తరహాలో నగర నడిబొడ్డున భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 1.84కోట్లు నగదు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ బాలానగర్, ఎస్ఓటీ శంషాబాద్, ఎస్ఓటీ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

- Advertisement -

అనంతరం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర(Stephen Raveendra) మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంటర్ స్టేట్ బెట్టింగ్ గ్యాంగ్ ఐపిఎల్ బెట్టింగ్(IPL Betting) లకు పాల్పడుతుందాన్న సమాచారం వచ్చిందని తెలిపారు. యాప్స్ ఉపయోగించి బెట్టింగ్ లకు పాల్పడుతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేసామన్నారు. వజ్ర 777. కం, వజ్ర ఎక్స్చేంజి, మెట్రో ఎక్స్చేంజి, తదితర యాప్స్ వాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

IPL Betting

IPL Betting

Read Also: మాలాంటి ముసలి వాళ్ళను చూసి యువత నేర్చుకోవాలి -సుధామూర్తి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...