Kasani |‘చంద్రబాబు కృషి వల్లే ఆ ఫలితాలు చేతికందుతున్నాయి’

-

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పేదలు కోటీశ్వరులు కావాలన్నదే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఆశ‌య‌మ‌ని, ఈ ల‌క్ష్యం దిశ‌గా ప్రత్యేక విజ‌న్‌తో ముందుకు వెళుతున్నార‌ని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. తెలుగు ప్రజ‌ల సంక్షేమం కోస‌మే బాబు నిరంత‌రం కృషి చేస్తున్నార‌న్నారు. నిబ‌ద్ధత క‌లిగిన ప్రజా నాయ‌కుడన్నారు. కొత్త విధానాల‌ను, వ్యవ‌స్థల‌ను ఏ విధంగా అందించాల‌ని నిరంత‌రం ఆలోచిస్తూ అదే ల‌క్ష్యసాధ‌న దిశ‌గా ప‌నిచేస్తున్నారన్నారు.

- Advertisement -

గతంలో విజన్ 2020 ని ప్రవేశపెట్టి దానిని అమలు చేసి చూపారని, బాబు విజ‌న్ ఫ‌లితంగానే నేడు వేల కోట్ల విలువైన ఐటీ ఫ‌లాలు చేతికందుతున్నాయ‌ని, త‌ద్వారా రాష్ట్ర సంప‌ద పెరుగుతుందన్నారు. మహనీయుల స్ఫూర్తితో చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనే చంద్రబాబు ఆలోచనపై ఒక విధాన పత్రాన్ని విడుదల చేయబోతున్నారన్నారు. చంద్రబాబు ఆలోచనలను ముందుకు తీసుకుపోదామని పార్టీ శ్రేణులకు కాసాని (Kasani Gnaneshwar) పిలుపునిచ్చారు.

Read Also: పొంగులేటిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే బాధ్యత రేణుకా చౌదరి తీసుకోవాలి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...