కర్ణాటకలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం అదే: కిషన్ రెడ్డి 

-

కర్ణాటకలో బీజేపీ ఓటమిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో తమ ఓటమి స్వయంకృతాపరాధమని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల కారణంగానే ఓడిపోయినట్లు చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఒక తప్పు చేస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్(BRS) వంద తప్పులు చేసిందని ఆయన విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. కర్ణాటక ప్రజల తీర్పును శిరసా వహిస్తామని, లోక్ సభ ఎన్నికల నాటికి తిరిగి పుంజుకుంటామన్నారు. తప్పులను సరిచేసుకుని లోకసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతామని కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. కర్ణాటకలో స్థానిక ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే తాము ఓడిపోయినట్లు తెలిపారు. తొందర్లోనే తాము చేసిన లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్‌కు ధైర్యం వస్తుందనడం వట్టి ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....