తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావు: హరీశ్ రావు

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 136 స్థానాలను హస్తగతం చేసుకొని సత్తా చాటింది. తాజాగా.. ఈ ఎన్నికలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పతనం సౌత్ ఇండియా నుంచి మొదలైందని అన్నారు. దేశంలోని మిగతా అన్ని చోట్ల ఆ పార్టీ ఖాతాలు క్లోజ్ అవుతాయని తెలంగాణలో అయితే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని హరీశ్ రావు(Harish Rao) ట్వీట్ చేశారు. ‘దిస్ ఈజ్ సౌత్ ఇండియా స్టోరీ’ అంటూ ట్వీట్ ఆరంభించిన ఆయన.. బీజేపీ పాలన నుంచి విముక్తి కలిగిస్తూ కర్ణాటకలో ఎన్నికల తీర్పు వచ్చిందని అన్నారు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.  ఇదిలా ఉంటే కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) స్టాండ్ పై ఉత్కంఠగా మారింది. మిత్రపార్టీగా ఉన్న జేడీఎస్(JDS) చిత్తుగా ఓడిపోవడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి కర్ణాటకలో గులాబీ బాస్ కేసీఆర్(KCR) ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్తారనేది ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...