ప్రీతి మృతిపై మందకృష్ణ ఆగ్రహం.. ప్రభుత్వం ఎదుట కీలక డిమాండ్

-

Manda Krishna Madiga |వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ భరించలేక ప్రీతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా.. ఈ ఘటనపై MRPS జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుట పలు కీలక డిమాండ్లు పెట్టారు. ప్రీతి మృతి కేసుపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ప్రియాంక రెడ్డికి జరిగిన న్యాయమే ప్రీతికి జరగాలని డిమాండ్ చేశారు. ప్రీతి మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రీతి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని మందకృష్ణ తెలిపారు. ప్రీతి మృతి కేసును హత్య కేసుగా మార్చాలని, వెంటనే జ్యూడీషీయరీ విచారణ జరపాలని మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
Read Also: తెలంగాణలో TRS పేరుతో కొత్త పార్టీ!!

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...