Minister Jagadish Reddy | ఆ పరంపరను కొనసాగిస్తున్నాము: మంత్రి జగదీశ్ రెడ్డి

-

భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని మంత్రి జగదీశ్‌ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లాలో జరిగిన బక్రీద్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలిచిందన్నారు. గంగా జమునా తెహజీబ్‌ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగిస్తున్నామని చెప్పారు. స్వరాష్ట్రంలో సూపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ KCR) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. మైనారిటీ సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. సంక్షేమంతోపాటు మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దేందుకు గురుకులాలు నెలకొల్పిందని చెప్పారు.

- Advertisement -
Read Also:
1. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి మరో అరుదైన గౌరవం

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...