SCV Naidu | చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కీలక నేత

-

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు(SCV Naidu) టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాయలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎస్‌సీవీ నాయుడు పసుపు కండువా కప్పుకున్నారు. ఎస్‌సీవీతోపాటు పలువురు నేతలు టీడీపీలో చేరారు. ఎస్‌సీవీ నాయుడు 2004లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కూడా బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎస్‌సీవీ నాయుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరారు. సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో శ్రీకాళహస్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో ఆయన టీడీపీకి దూరమయ్యారు. అనంతరం వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపునకు కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఎస్‌సీవీ నాయుడు(SCV Naidu)కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి, గురువారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -
Read Also:
1. టీడీపీ బస్సుయాత్రలో తీవ్ర విషాదం
2. సాక్ష్యాధారాలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం: చంద్రబాబు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...