Minister KTR | వ్యవస్థలో లోపాలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

-

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో లోపాలు ఎప్పటికీ ఉంటాయని, అన్నింటినీ భూతద్దంలో చూడవద్దని అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అగం కావద్దని, ఎవరో వచ్చి ఉపన్యాసాలు ఇవ్వగానే తొందర పడవద్దని సూచించారు. తాము ఖర్చు పెట్టే డబ్బులు ప్రజలవేనని, తమ పైసలు కాదని, అందుకే జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తాను కారులో వస్తుంటే ఇద్దరు ముగ్గురు యువకులు అడ్డం పడుతారని, అది సహజమే అన్నారు. ఇక్కడి ఎంపీ ఆ యువకులను రెచ్చిగొట్టి పంపించాడని వాళ్లు గుర్తించకపోవడం మూలంగా ఇలాంటివి జరుగుతుంటాయని తెలిపారు. ఎంపీకి చేతనైతే స్కూల్స్ కట్టించాలని సవాల్ చేశారు. కులాలు, మతాల పేరిట రాజకీయం చేయడం ఇకనైనా మానుకోవాలని కేటీఆర్(Minister KTR) హితవు పలికారు.

- Advertisement -
Read Also:
1. ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు
2. ప్రజల ఉసురు పోసుకునేందుకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారా?

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...