Munugode Bypoll: కారులో రూ.20 లక్షలు నగదు స్వాధీనం

-

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తుండగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు ఓ కారును తనిఖీ చేస్తుండగా.. కారులో సుమారుగా రూ.20లక్షలు నగదును గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మునుగోడు (Munugode) నియోజకవర్గ వ్యాప్తంగా 16 చెక్‌ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read also: వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...