Nagarjuna Sagar | సాగర్ వివాదంపై అధికారులతో ముగిసిన కేంద్రం సమావేశం

-

నాగార్జునసాగర్(Nagarjuna Sagar) నీటి విడుదలలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్ వర్చువల్‌గా హాజరయ్యారు. వివాదం పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

- Advertisement -

మరోవైపు సాగర్(Nagarjuna Sagar) పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డు(Krishna River Management Board), కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్(CRPF) బలగాలు డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇదిలా ఉంటే గురువారం ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: చంద్రబాబు జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఖరారు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...