Naveen Murder Case |చర్లపల్లి జైలు నుంచి నిహారిక విడుదల!

-

Naveen Murder Case |తెలంగాణలో గత ఫిబ్రవరి 17వ తేదీన నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థి నవీన్‌ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ హత్య చేసిన తీరు తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవీన్ ప్రియురాలు అయిన నిహారికకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో నిహారిక ఆదివారం జైలు నుంచి బయలకు వచ్చింది. ఈ కేసులో ప్రథాన నిందితుడు హరిహర కృష్ణ ఏ1, అతని స్నేహితుడు హాసన్‌ ఏ2, ప్రియురాలు నిహారిక ఏ3 నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్‌లలోని కీలక సమాచారాన్ని తొలగించినందుకు నిహారిక, హాసన్‌లను పోలీసులు తొలుత అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణలో నిహారిక, హాసన్‌లు హత్యకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనంతరం ఆమెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు నవీన్ హత్యకు(Naveen Murder Case) సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది.

- Advertisement -
Read Also: మిచెల్ స్టార్క్ ధాటికి కుప్పకూలిన భారత్‌

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...