నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ కలెక్టర్‌‌ పై దాడి

-

మహబూబాబాద్‌(Mahabubabad) రైల్వై స్టేషన్‌లో కొందరు ప్రయాణికులు హల్‌చల్ చేశారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ విషయంలో రైల్వే టీసీపై ఇద్దరు ప్రయాణికులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం టీసీ కిరణ్ కుమార్ రైలు ఎస్1 కోచ్‌లో తనిఖీలు చేస్తుండగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రవితేజ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ క్రమంలో ఫైన్ కట్టాలని టీసీ కిరణ్ కుమార్ అతనికి చెప్పాడు. దాంతో రెచ్చిపోయిన రవితేజ దాడి చేసి కిరణ్ కుమార్‌పై పిడిగుద్దులు కురిపించాడు. దాడిలో కిరణ్ కుమార్‌కు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన జీఆర్పీ పోలీసులు రవితేజను అరెస్ట్ చేశారు. కిరణ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
Read Also: రాహుల్ గాంధీ సారీ చెప్పాల్సిందే: కేంద్ర మంత్రి

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి,...

వైసీపీ అభ్యర్థికి 18నెలల జైలు శిక్ష.. విశాఖ కోర్టు సంచలన తీర్పు..

దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ...