TSPSC పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే

-

Mahesh Kumar Goud |తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే టీఎస్‌పీఎస్‌సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. TSPSC పేపర్​ లీక్ వ్యవహారంలో పెద్దల హస్తం ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ​మహేశ్ ​కుమార్ ​గౌడ్(Mahesh Kumar Goud) ఆరోపించారు. కిందిస్థాయి ఉద్యోగులను బలిచేసి పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల పోరాటం వల్ల వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలను అమ్మకాలకు పెడుతున్నారని ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని ఉద్యోగ నియామకాలపైనా సిట్టింగ్​జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్​చేశారు.

- Advertisement -
Read Also: దేశంలో ప్రజాస్వామ్యం ఉంటె.. నా అభిప్రాయం చెప్పగలను: రాహుల్ గాంధీ

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...