ఆ కుంభకోణంలో కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు పాత్ర కూడా ఉంది: RSP

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఒక అనాథ అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గోస పట్టించుకునేనాథుడు లేడన్నారు. దు:ఖంలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఓదార్పు ఇచ్చేందుకు బీఎస్పీ ఆధ్వర్యంలో మే 7న హైదరాబాద్ సరూర్ నగర్‌లో తెలంగాణ భరోసా సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. జూనియర్ పంచాయతీ కార్యర్శులు ఆరు రోజులుగా రోడ్లపైనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయి నష్ట పరిహారం ఇవ్వండని రైతులు అడుగుతుంటే వారిని పట్టించుకున్న నాథుడే లేరని మండిపడ్డారు.

- Advertisement -

మిల్లర్లు చేస్తున్న దోపిడీని అడ్డుకునే నాథుడూ కరువయ్యారన్నారు. దళితబంధులో ఒక్కొక్క ఎమ్మెల్యే రూ.3 లక్షలు తీసుకున్నారని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో 36 లక్షల మంది విద్యార్థులు జీవితాలు నాశనమయ్యాయి. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్‌(TSPSC Paper Leak)పై నిజాలు బయటకు రావాలి. దాని వెనుక కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. సీఎం కేసీఆర్(KCR), మంత్రులు కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harish Rao), ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కూడా ఈ కుంభకోణంతో సంబంధం ఉంది. పేపర్ లీక్ ఘటన జరిగి ఇప్పటికీ 50 రోజులైందని, అసలు సూత్రదారులను పట్టుకోలేకపోయారని మండిపడ్డారు.

Read Also: పొంగులేటితో ఈటల భేటీ పై బండి సంజయ్ రియాక్షన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...