సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సర్కార్ పరిహారం

0
secunderabad

సికింద్రాబాద్‌‌(Secunderabad)లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌‌లో అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ ఘటనతో జంట నగరాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో పెనుప్రమాదం నుంచి బయటపడినా.. భారీగా ప్రాణనష్టం, ఆస్థినష్టం అపలేకపోయారు. ఈ ప్రమాదంలో పొగకారణంగా అస్వస్థతకు గురైనా పలువురు స్థానికులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాంధీ హాస్పిటల్‌లో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ శుక్రవారం రాత్రి పరామర్శించారు. అగ్ని ప్రమాద మృతులకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రభుత్వ ఆర్ధిక సహాయం ప్రకటించారు.

Read Also: టీమిండియా ఘన విజయం

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here