ఇప్పటికే కేంద్రం చాలా సార్లు చెప్పింది, ఇక ఫైనల్ డేట్ ఇచ్చింది, కచ్చితంగా ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలి అని తెలిపింది, ఇక ఫైనల్ డేట్ కేంద్ర ప్రభుత్వం 2021 మార్చి 31వ తేదీ అని చెప్పేసింది… అసలు గత ఏడాది జూన్ 30 అన్నారు కాని ఆ సమయంలో కరోనా పరిస్దితి లాక్ డౌన్ వల్ల దీనిని మరింత పెంచారు.. అయితే ఇక ఈసారి ఈ డేట్ పెరగకపోవచ్చు అని అంటున్నారు.
అయితే మీరు ఆధార్ పాన్ కార్డ్ మీ బ్యాంకు బ్రాంచీలో ఇచ్చినా మీకు లింక్ చేయడం జరుగుతుంది.. ఒకవేళ మీరు ఇంకా ఇవ్వకపోతే ఇలా ఇచ్చి ఆధార్ పాన్ లింక్ చేసుకోవచ్చు… ఇక ఇంటిలో ఉండి కూడా దీనిని లింక్ చేసుకోవచ్చు మరి అది ఎలా అనేది ఇప్పుడు సింపుల్ గా చెప్పుకుందాం… ఒకవేళ మీరు ఈ మార్చి నెలాఖరున చేసుకోకపోతే పది వేల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందట.
www.incometaxindiaefiling.gov. in అనే వెబ్ సైట్ ఓపెన్ చేయండి
Link Aadhaar అని కనిపిస్తుంది దానిని క్లిక్ చేయండి
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
అక్కడ పాన్ నెంబర్
ఆధార్ నెంబర్
ఆధార్ లో పేరు ఎలా ఉందో అలా ఇవ్వాలి
కాప్చ్ కోడ్ ఎంటర్ చేసి
లింక్ ఆధార్ అని ప్రెస్ చేయండి సో మీకు ఆధార్ పాన్ లింక్ అవుతుంది.
ReplyForward
|