Flash: ఐపీఎల్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

0
49

క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే మరణించిన ఆసీస్​ ప్లేయర్స్​ రాడ్​ మార్ష్​, స్పిన్​ దిగ్గజం షేన్ వార్న్​ మరణాలు మరవకముందే మరో ప్రముఖ క్రికెటర్ మరణించారు. ఆస్ట్రేలియా జట్టులో దిగ్గజ క్రికెటర్ అయినా ఆండ్రూ సైమండ్స్​ మృతి చెందడంతో ఐపీఎల్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

అతను శనివారం రాత్రి 10.30గంటలకు క్వీన్స్​లాండ్​లోని అలైస్​ రివర్​ బ్రిడ్జ్​ దగ్గర ఉన్న హెర్వే రేంజ్​ రోడ్​లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈయన మరణవార్త విన్న కొందరు క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కెరీర్​లో ఆల్​రౌండర్​గా సత్తా చాటిన సైమండ్స్​ మృతితో ఆస్ట్రేలియా జట్టులో తీరని విషాదం చోటుచేసుకుంది.