వారెవ్వా..40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన యువ సంచలనం పంత్

Warewwa..40 year old record breaking young sensation Pant

0
74

టీమిండియా యువ సంచలనం పంత్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంకతో జరుగున్న 2వ టెస్ట్ లో రెండో రోజు మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించాడు. కాగా పంత్ తరవాత 1982లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. వీరి తరువాత శార్థాల్ ఠాకూర్ 31 బంతుల్లో, వీరేంద్ర సెహ్వాగ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు.

చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ డే నైట్ టెస్ట్ లో భారత్ పై చేయి సాధిస్తోంది. మొదటి ఇన్సింగ్స్ లో 252 పరుగులకు ఇండియా ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసి శ్రీలంక కేవలం 109 పరుగులకే చాపచుట్టేసింది. బూమ్రా సూపర్ బౌలింగ్ తో అదరగొట్టాడు. 5 వికెట్లు తీసి శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. మరోవైపు అశ్విన్, షమీ చెరో రెండు వికెట్లు తీశారు. 143 పరుగుల లీడ్ తో రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పంత్ 50, రోహిత్ శర్మ 46, హనుమ విహారి 35 పరుగులు చేశారు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్  18, రవీంద్ర జడేజా 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మొత్తంగా ఇండియా, శ్రీలంకపై 342 పరుగుల లీడ్ లో ఉంది.