ఆస్ట్రేలియాలో టీమిండియా చరిత్ర సృష్టించింది. కంగారుల బంతులకి సమాధానం చెప్పింది..1988 తర్వాత బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో ఓటమెరుగని కంగారూలకు తొలిసారి ఓటమిని టీమిండియా రుచి చూపించింది..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది భారత్, దీంతో మన వారు ఎంతో ఆనందంలోఉన్నారు.
2-1 తేడాతో సిరీస్ను గెలిచింది. 31 ఏళ్లుగా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్ను ఓడించడంతో సరికొత్త రికార్డు నమోదు చేశారు, ఇక ఆట ఆడిన తీరు అందరికి నచ్చింది, కుర్రాళ్లు అద్బుతమైన ఆటతో అలరించారు, గబ్బా టెస్ట్లో విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఆస్ట్రేలియాలో టీమిండియా అద్భుత విజయం ఎంతో సంతృప్తినిచ్చిందని అభినందించారు.
ఇక తాజాగా ఈ సిరీస్ గెలిచిన ఆటగాళ్లకు గుడ్ న్యూస్ ..భారత జట్టుకు రూ.5 కోట్ల బోనస్ను ప్రకటించింది బీసీసీఐ. ఇక సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వస్తున్నాయి, కుర్రాళ్ల ఆటకి అందరూ ఫిదా అయ్యారు.
.