ఇక చాలు ధోనీ సేవ‌లు సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం

-

షార్జాలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర ఓటమి పాలైంది చెన్నై టీమ్.. ఇంత పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న ఈ ఐపీఎల్ సీజ‌న్ లో క‌నిపించ‌లేదు అనే చెప్పాలి.. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీల నుంచి పూర్తిగా నిష్క్రమించింది.

- Advertisement -

ప‌దేళ్లుగా ప్లే ఆఫ్ వరకూ వెళ్లిన సీఎస్కే ఇప్పుడు మాత్రం దారుణ‌మైన ఆట‌తో వెనుక‌బ‌డింది
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో మంది సీఎస్కే ఫ్యాన్స్, ఇక తమ జట్టుకు కెప్టెన్ గా ధోనీ వద్దంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

11 మ్యాచ్ లను ఆడిన చెన్నై జట్టు 8 మ్యాచ్ లలో ఓడిపోయింది. గెలిచింది 3 మ్యాచ్ లు మాత్ర‌మే, ఇక పాయింట్స్ చూసుకున్నా అత్యంత త‌క్కువ ఉన్నాయి, ఇంకా మూడు మ్యాచ్ లను మాత్రమే సీఎస్కే ఆడాల్సి వుంది. ఆ మూడు మ్యాచ్ లలో గెలిచినా, గరిష్ఠంగా 12 పాయింట్లు మాత్రమే వస్తాయి. సో ఇక ఆజ‌ట్టు ప్లేఆఫ్ కు స్దానం ఉండ‌దు.

ఇక ధోనీ నుంచి బాధ్య‌త‌లు వేరేవారికి ఇవ్వాలి అని చాలా మంది సోష‌ల్ మీడియా ద్వారా కామెంట్లు పోస్టుల‌తో కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...