వైసీపీ నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రెడీ.. లోకేష్‌కు సవాల్ స్వీకరించే దమ్ముందా?

-

Kodali Nani |తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ‘యువగళం పాదయాత్ర’ నిర్వహిస్తున్న నారా లోకేష్.. తాజాగా సీఎం వైఎస్ జగన్ కు ఓ సవాల్ విసిరారు. లోకేష్ సవాల్‌కు కొడాలి నాని(Kodali Nani) స్పందించారు. రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లో ఎక్కడైనా, వైసీపీకి పోటీగా లోకేష్ యువగళం సభ పెట్టాలని కొడాలి నాని సవాల్ విసిరిరారు.

- Advertisement -

లోకేష్ యువగళంకు పోటీగా తమ పార్టీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని చేత సభ పెట్టిస్తామన్నారు. లోకేష్ సభకంటే, సిద్ధార్థ రెడ్డి సభకు పదిరెట్లు యువత రాకుంటే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానన్నారు. యూత్‌లో లోకేశ్‌ కంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డికే క్రేజ్ ఎక్కువ అని వ్యాఖ్యానించారు. యువతలో సిద్ధార్థ రెడ్డికి విపరీతమైన ఆదరణ ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఏ సెంటర్‌లో అయిన సిద్ధార్థరెడ్డి పిలుపునిస్తే ఎంతమంది యువత వస్తారో.. లోకేశ్ పిలిస్తే ఎంతమంది యువత వస్తుందో చెక్ చేసుకోవాలని సవాల్ విసిరారు.

Read Also: వేసవిలో మూడు పూటలా నిమ్మరసం తాగితే ఏమవుతుంది?

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...