Eatala Rajender | ఈటల రాజేందర్‌కు ముప్పు ఉన్నట్లు నిర్ధారణ.. సీల్డ్ కవర్‌లో డీజీపీకి రిపోర్ట్

-

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్‌(Eatala Rajender) భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈటల రాజేందర్‌‌కు ముప్పు ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. హుజురాబాద్‌తో పాటు జిల్లాల పర్యటనల్లో అనుమానాస్పద కార్లు తిరుగుతున్నాయని ఈటల వ్యాఖ్యానించిన నేపథ్యంలో డీసీపీ సందీప్ రావు ఈటలను కలిసి వివరాలు సేకరించారు. ఆయన భద్రతపై డీజీపీకి సీల్డ్ కవర్‌లో రిపోర్ట్ పంపించారు. కాసేపట్లో రాజేందర్‌కు భద్రత పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈటల రాజేందర్‌‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని, హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నట్లుగా తమకు తెలిసిందని ఈటల జమున ఆరోపించిన విషయం తెలిసిందే.

- Advertisement -

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అండతో కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాటల వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని.. ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్తారని అన్నారు. హుజూరాబాద్‌ జనంపైకి కౌశిక్‌ రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఉసిగొల్పారని.. దీంతో కౌశిక్ హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, జమున ఆరోపించిన రెండ్రోజులకే ఈటల(Eatala Rajender)కు ముప్పులు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించడం, భద్రత పెంపుపై నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Read Also:
1. ‘ఊర కుక్కల్లారా.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి’
2. పవన్ కల్యాణ్-సాయితేజ్ BRO టీజర్ విడుదల

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...