TDP Leader Pattabhi | జైలు నుంచి పట్టాభి విడుదల.. వైసీపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు

-

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి రామ్(TDP Leader Pattabhi) విడుదలైన విషయం తెలిసిందే. రూ.25వేల చోప్పున పూచీకత్తుతో పట్టాభికి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకొచ్చిన ఆయనకు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విడుదలైన వెంటనే మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు చెందిన పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలపై దాడులు జరిగినా, అన్యాయం జరిగినా తాము వెళ్తామని అన్నారు. తనను అరెస్ట్ చేసినప్పటి నుంచి ప్రతినిత్యం ఎస్పీ డైరెక్షన్‌లో ఈ వ్యవహారమంతా నడిచిందని ఆయన మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ గదిలో తనను విచక్షణారహితంగా కొట్టారని చెప్పారు. ఇదంతా ఎస్పీ ప్లాన్ పక్కాగా అమలు చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు.

- Advertisement -
Read Also: రాష్ట్ర యువతకు ఐటీశాఖ మంత్రి శుభవార్త

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...