అమ్మాయి పేరుతో 350 మందిని మోసం చేసిన మిమిక్రీ ఆర్టిస్ట్….

అమ్మాయి పేరుతో 350 మందిని మోసం చేసిన మిమిక్రీ ఆర్టిస్ట్....

0
31

ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ అమ్మాయి వాయిస్ తో ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 350 మందిని నమ్మించి మోసం చేశారు… ఈ సంఘటన తమిళనాడులో జరిగింది… ఈ మెల్ ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చే శారు…

ఈ దర్యాప్తులో తిరునేల్వేలి జిల్లా పణుకుడికి చెందిన వళ్లల్ రాజకుమార్ అనే వ్యక్తి మిమిక్రీ ఆర్టిస్ట్ అమ్మాయిల గొంతుతో అబ్బాయిలకు ఫోన్ చేసి వారిని ట్రాప్ లో వేసుకుంటారని ట్రాప్ లో పడిన తర్వాత వారిదగ్గరనుంచి అధిక మొత్తంలో డబ్బులు వసులు చేసేవాడని విచారణలో తేలింది…

ఆతర్వాత పత్తాలేకుండా పోయేవాడు ఇలా ఒకరిని కాదు ఇద్దరినికాదు ఏకంగా 350 మందిని మొసం చేశాడు.. తాజాగా పోలీసులకు ఈమెల్ ద్వారా ఫిర్యాదు వచ్చింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది… దీంతో రాజకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…