ప్రియురాలి కోసం చేసిన ప‌ని చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చింది

ప్రియురాలి కోసం చేసిన ప‌ని చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చింది

0
32

అమ్మ‌నాన్న‌ని ఒప్పించాడు, పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు, ఈ ఏప్రిల్ లో అత‌గాడి పెళ్లి అవ్వాలి, అమ్మాయి త‌ర‌పున వారు కూడా లాక్ డౌన్ అయ్యాక పెళ్లి చేస్తాం అన్నారు, కాని అమ్మాయి అబ్బాయి మాత్రం సింపుల్ గా పెళ్లి చేసుకుంటాం అని అన్నారు, అయితే ఇటు ఒడిశా నుంచి 16 బైక్స్ మీద అబ్బాయి కుటుంబం స‌రిహ‌ద్దులో ఉన్నగ్రామానికి చేరుకున్నారు,

అంతా బాగానే ఉంది పెళ్లి బాగానే జ‌రిగింది, తిరిగి ఫంక్ష‌న్ అయిన త‌ర్వాత గ్రామానికి వీరి కుటుంబ స‌భ్యులు వెళ్లిపోయారు, మొత్తం 30 మంది అబ్బాయి త‌ర‌పున హాజ‌రు అయ్యారు, దీనిపై పోలీసుల‌కు కంప్లైంట్ వ‌చ్చింది, చివ‌ర‌కు అత‌ను ఏ ప‌ని చేస్తాడు అని తెలుసుకున్నారు, అత‌ను కూర‌గాయ‌ల ట్ర‌క్ న‌డుపుతాడు అని చెప్పాడు.

పెళ్లికొడుకు ట్రావెల్ హిస్ట‌రీ చాలా ఉంది, దీంతో అత‌నిని వైద్యులు చెక్ చేశారు, టెస్ట్ చేస్తే వైర‌స్ పాజిటీవ్ అని వ‌చ్చింది, ఏ ల‌క్ష‌ణాలు లేవు అని త‌న‌కు వైర‌స్ లేదు అనుకున్నాడు, చివ‌ర‌కు వివాహం అయి 24 గంట‌లు అవ్వ‌కుండానే వైద్యులు చికిత్స కు తీసుకువెళ్లారు, ఇప్పుడు అంద‌రిని టెస్టులు చేయించుకోమ‌ని 14 రోజులు గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు రావ‌ద్దు అన్నారు.