మన దేశంలో కొత్త వైరస్ 15వేల పందులు మృతి… ఎక్కడో తెలుసా

మన దేశంలో కొత్త వైరస్ 15వేల పందులు మృతి... ఎక్కడో తెలుసా

0
26

ఎక్కడో చైనాలోని ఊహాన్ ప్రాంతంలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది… అర్థిక దేశాలు అయిన అమెరికా, బ్రిటిన్ ఇటలీ వంటి దేశాలు కరోనా దాటికి అతలా కుతలం అవుతున్నాయి… ఇక అభివృద్ది చెందుతున్న మనదేశంలో కూడా కరోనా వైస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది…

ఈ వైరస్ అంతమొందించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్న సమయంలో దేశంలో మరో కొత్త వైరస్ ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.. దేశంలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరో ప్లూను అధికారులు గుర్తించారు…ఆఫ్రికన్ స్వైన్ ఫివర్ గా పిలువబడే ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో వేల పందులు మృత్యువాత పడ్డాయి…

ఈ వైరస్ ను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్ మరికొన్ని రాష్ట్రాలకు వ్యాపించిందని తెలిపారు… అయితే ఈ వ్యాది జంతువుల నుంచి జంతువులకే వ్యాపిస్తుందని మనుషులకు కాదని అధికారులు తెలిపారు…