తెల్ల‌వారు జామున శివాల‌యం తెరిచిన పూజారి, లోప‌ల చూసి పూజారీ ఆశ్చ‌ర్యం

తెల్ల‌వారు జామున శివాల‌యం తెరిచిన పూజారి, లోప‌ల చూసి పూజారీ ఆశ్చ‌ర్యం

0
50

మంగాపురంలో ఉద‌యం తెల్ల‌వారు జామున శివాల‌యం తెరిచారు పూజారీ శంక‌ర శ‌ర్మ‌, అయితే లాక్ డౌన్ కార‌ణంగా దేవాల‌యానికి ఎవ‌రూ రావ‌డం లేదు.. కేవ‌లం స్వామికి నిత్యం కైంక‌ర్యాలు పూజ‌లు అన్నీ పూజారి చేస్తున్నారు, స్వామికి నిత్యం జ‌రి‌పే సేవ‌లు పూజ‌లు అభిషేకాలు చేస్తున్నారు, ఈ స‌మ‌యంలో తెల్ల‌వారుజామున ఆయ‌న శివాల‌యానికి వ‌చ్చారు..

ఉద‌యం స్వామి గుడి త‌లుపులు తెర‌వ‌గానే రెండు స‌ర్పాలు శివుడిని చుట్టుకుని ఉన్నాయి, దీంతో ఒక్క‌సారిగా పూజారి ఆశ్చ‌ర్య‌పోయాడు, వాటిని ఏమీ చేయలేదు దాదాపు 2 గంట‌ల వ‌ర‌కూ అవి అక్క‌డే ఉన్నాయి, అభిషేకం చేసినా అవి వెళ్ల‌లేదు.

దీంతో ప‌క్క‌న వారికి విష‌యం తెలిసి కొంద‌రు చూసేందుకు వ‌చ్చారు, అయితే ఆయ‌న పూజ పూర్తి చేసి త‌లుపులు మూసేశారు మ‌ళ్లీ సాయంత్రం వ‌చ్చేసరికి ఆ పాములు గుడిలో క‌నిపించ‌లేదు, ఇదంతా శివయ్య లీల అంటూ అక్క‌డ భ‌క్తులు స్వామిని త‌ల‌చుకుంటున్నారు.