బాబుకు షాక్ ఒకే సారి వైసీపీలోకి 150 టీడీపీ నేతలు

బాబుకు షాక్ ఒకే సారి వైసీపీలోకి 150 టీడీపీ నేతలు

0
39

రానురాను ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది… గత ఎన్నికల్లో అదికారం కోల్పోవడంతో ఎవరిదారి వారుచూసుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు… తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన 150 మంది టీడీపీ నేతలు సైకిల్ దిగి వైసీపీ కండువాను భూజాన వేసుకున్నారు..

ఈ విషయాన్ని వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు… వీరందరు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరారని అన్నారు… కాగా 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడలో పోటీ చేసిన అవినాష్ నాని చేతిలో ఓటమి చెందారు…

ఆతర్వాత వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే… ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపిస్తున్నారు… జగన్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యాలు అప్పజెప్పారు…