చంద్రబాబుకు షాక్… దేశ వ్యాప్తంగా మరో రికార్డ్ బద్దలు కొట్టిన సీఎం వైఎస్ జగన్

చంద్రబాబుకు షాక్... దేశ వ్యాప్తంగా మరో రికార్డ్ బద్దలు కొట్టిన సీఎం వైఎస్ జగన్

0
38

దేశ వ్యాప్తంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో రికార్డ్ సృష్టించారు… మే 29 నాటికి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తాజాగా సీ ఓటర్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది… ప్రధాన మంత్రితో పాటు ముఖ్యమంత్రుల ప్రజాధారణపై ఒక నివేధిక విడుదల చేసింది…

ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65 శాతం ప్రజలు మద్దతు లభించిందని తెలిపింది…ముఖ్యంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడు నిర్ణయాలతో ప్రజల దృష్టిని మోదీ ఆకర్షించారని తెలిపింది… మోదీ పనితీరుపై ప్రజలకు విస్వాసం పెరిగిందని తెలిపింది… ఇక ముఖ్యమంత్రుల పనితీరుపై కూడా సీఓటర్ సర్వే నిర్వహించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి…

ఏపీ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ వ్యాప్తంగా టాప్ 5 లో సీఎంల జాబితాలో చోటు దక్కింది… ప్రభుత్వ నిర్ణయాలు పనితీరు ఆధారంగా ఈ సర్వే రూపొందించగా సీఎం జగన్ కు 78.1 శాతం మంది ప్రజలు మద్దతు లభించింది… నాలుగో స్థానంలో సీఎం జగన్ చోటు దక్కించుకున్నారని సీఓటర్ సర్వే తమ నివేధికలో తెలిపింది…