చంద్రబాబు మిస్సింగ్

చంద్రబాబు మిస్సింగ్

0
35

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనిపించడంలేదంటూ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రజలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు… టపాసులు కాల్చుకుంటూ భారీ ర్యాలీగా పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రజలు చంద్రబాబు కనిపించకున్నారని కంప్లైంట్ చేశారు…

కుప్పంలోని సమస్యలను చెప్పుకునేందుకు తమ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు అందుబాటులో లేరని పోలీసులకు ఫిర్యాదు చేశారు… 30 సంవత్సరాలుగా చంద్రబాబును గెలిపిస్తూనే ఉన్న కుప్పం ప్రజలకు మూడు నామాలు పెట్టివెళ్లారని మండిపడుతున్నారు…

కుప్పం ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తున్నారని ఆరోపించారు… అందుబాటులేని కుప్పం ఎమ్మెల్యే మాకు అవసరంలేదని అంటున్నారు..