దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాలు ఇవే…

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాలు ఇవే...

0
34

భారత్ కరోనా వైరస్ విజృంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే… రోజు రోజుకు కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి… అయితే రికవరీ శాతం క్రమక్రమంగా మెరుగుపడుతుండటంతో ఉపశమనిస్తోంది…

ప్రస్తుతం దేశంలో 41,12,552 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు… 10,17, 754 మంది కరోనాతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు… దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల్లో 60 శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి…

ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లోనే 49 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి… అయితే మరణాల రేటు ఒక శాతం తగ్గి ప్రస్తుతం 1.64 శాతానికి తగ్గింది..