ఫుల్ క్లారిటీ ఇచ్చిన గంటా చంద్రబాబు హ్యాపీ

ఫుల్ క్లారిటీ ఇచ్చిన గంటా చంద్రబాబు హ్యాపీ

0
25

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను విశాఖ రాజధానిని స్వాగతిస్తున్నానని అన్నారు అయితే రాజధాని కోసం గతంలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు… విశాఖలో రాజధాని వస్తే శాంతి భద్రతలు లోపిస్తాయనే భాయాందోళనలను ప్రభుత్వం తోలగించాలని ఆయన డిమాండ్ చేరుశారు…

అలాగే తాను పార్టీ మారుతానంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నవాటిపై కూడా గంటా కొట్టిపాడేశారు… తాను పార్టీ మారే ఉద్దేశం లేదని అన్నారు… కాగా కొద్దికాలంగా ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి… ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరరని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకోన్నారని వార్తలు వచ్చాయి…అంతేకాదు వైసీపీలో చేరే విషయంలో మంత్రి విషయంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈ ప్రయత్నానికి కళ్లెం పడిందని వార్తలు వచ్చాయి….

అయితే వీటన్నింటిపై గంటా క్లారిటీ ఇచ్చారు… తాను టీడీపీలో కొనసాగుతానని అన్నారు… పార్టీ మారే ఆలోచన తనకు లేదని అన్నారు…. తనపై వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు… ఇటువంటి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని అన్నారు…