Home రాజకీయం వల్లభనేనికి మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్

వల్లభనేనికి మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్

వల్లభనేనికి మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్

0
199

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో వల్లభనేని వంశీ భేటీ అయ్యారు, సచివాలయానికి వచ్చిన ఆయన సుమారు అరగంట సేపు చర్చించారు రాజకీయంగా పలు విషయాలు చర్చించారు అంతేకాదు గన్నవరం లో పలు ప్రజా సమస్య లగురించి ఆయన ఓ రిపోర్ట్ ఇచ్చారు అని తెలుస్తోంది పలు అభివ్రుద్ది పనుల గురించి రైతు సమస్యల గురించి తెలియచేశారు. అయితే ఆయన ముఖ్యంగా తన రాజీనామా అంశం గురించి చర్చించారు అని తెలుస్తోంది

డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.. ఈ సమయంలో వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారా లేదా అనేది చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఈ సమయంలో అసెంబ్లీలో ఆయన ఏ వరుసన ఉంటారు అలాగే వంశీ ఏ పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడతారు అనేది చర్చ జరుగుతున్న అంశం.

ముఖ్యంగా ఉప ఎన్నిక గురించి అలాగే పార్టీ పరిస్దితి యార్లగడ్డ పదవి ఇలా అనేక అంశాలు చర్చించారట.. అయితే జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాల తర్వాత రాజీనామా గురించి చూద్దాం అని చెప్పారట.