జగన్ ఇచ్చిమన మాట నిలబెట్టుకున్నారు-లోకేశ్

జగన్ ఇచ్చిమన మాట నిలబెట్టుకున్నారు-లోకేశ్

0
29

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని లోకేశ్ అన్నారు. కొద్దికాలంగా పెంచుకుంటూ పోతూ, ఉల్లిధర 100 చేసి సెంచరీకొట్టారని ఎద్దేవా చేశారు…

అలాగే ఇసుక ధర ఐదురెట్లు పెంచారు. వైసీపీ కార్యకర్తలకు 5వేల జీతాన్ని 8వేలు చేసి సంవత్సరానికి 4వేలకోట్ల ప్రజాధనం రివర్స్ టెండర్ పెట్టారని లోకేశ్ ఎద్దేవా చేశారు. సొంతపత్రికకు 200శాతం ప్రకటన రేట్లుపెంచి దోపిడీచేస్తున్నారని మండిపడ్డారు

అంతేకాదు సొంత మీడియాలో పనిచేసే పరివారానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్షల్లో జీతం పెంచేసారని ఆరోపించారు. ఇన్ని పెంచిన జగన్ సంక్షేమానికి మాత్రం కోతలు పెడుతున్నారని ఆరోపించారు. అవ్వా, తాతలకు నెలకు 250, రైతులకు 600 మాత్రమే ఇస్తూ, రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ పిట్ట కథలు చెబుతూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.