సంచలనం జగన్ ను టార్గెట్ చేస్తూ రాజీనామాకు సిద్దమైన చంద్రబాబు నాయుడు

సంచలనం జగన్ ను టార్గెట్ చేస్తూ రాజీనామాకు సిద్దమైన చంద్రబాబు నాయుడు

0
34

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లి ధరపై వాడీ వేడి చర్చ జరిగింది… ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని ఉల్లికోసం రైతు బజార్లో ప్రజలు కిలో మీటర్లు మేరా నిలబడాల్సి వస్తుందని అన్నారు…. కిలో ఉల్లి పాయలు 25 రూపాయలకు అమ్ముతున్నామని చెబుతున్నా కూడా అది అన్ని చోట్లా అమలు కావడంలేదని అన్నారు…

దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలుగజేసుకుని హెరిటేజ్ షాపింగ్ మాల్ ల్లో కిలో ఉల్లిపాయలు 200 రూపాలయకు అమ్ముతున్నారని అందుకే కిలో మీటర్లమేర ప్రజలు క్యూలో నిలబడాల్సి వస్తోందని అన్నారు… దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థతో తమకు సంబంధం లేదని అన్నారు…

ఒక వేళ ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు… నిరూపించలేని పక్షంలో జగన్ మోమన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు… ఈ క్రమంలో ఇరుపార్టీలు నిరూపిస్తామని సవాల్ విసురుకున్నారు….