టీడీపీ తరపున నెక్ట్స్ సీఎం అభ్యర్థి ఆయనేనా

టీడీపీ తరపున నెక్ట్స్ సీఎం అభ్యర్థి ఆయనేనా

0
53

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు… చంద్రబాబు నాయుడుకు జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని కామెంట్స్ చేశారు…

ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని చంద్రబాబు అనుకుంటున్నారని వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట అని కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి.

కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును కాబోయే సీఎంగా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారని విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు…