జగన్ వేసే స్కెచ్ తో లోకేష్ పని అయిపోనట్టేనా

జగన్ వేసే స్కెచ్ తో లోకేష్ పని అయిపోనట్టేనా

0
42

2019 ఎన్నికల్లో భారీ ఓటమి చుసిన టీడీపీ ఇక ఏమి చేయలేక వైసీపీ ని విమర్శించే పనిలో నిమగ్నమయినట్టుగా తెలుస్తుంది . ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయం లో అక్కడక్కడా జరుగుతున్న అవినీతి గురించి వైసీపీ పై విమర్శలు చేస్తుంది .ఇప్పుడు అదే కోవలో కి నారా లోకేష్ కూడా చేరిపోయారు .

వైసీపీ పాలనలో జరిగే చిన్న చిన్న తప్పులను ప్రెస్ మీట్ లు పెట్టిమరీ ఎత్తి సుపాదం పై వైసీపీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది . అబివృద్దిని గమనించని ప్రతిపక్షం అనవసరంగా వైసీపీ పై ఆరోపణలు చేయటం పై పార్టీ లో అసహనం వెల్లడవుతుంది .లోకేష్ బాబు దూకుడికి చెక్ పెట్టడానికి జగన్ ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది .

టీడీపీ హయాం లో లోకేష్ ఐటీ శాఖామంత్రిగా ఉన్న సమయం లో జరిగిన ఫైబర్ నెట్ వివాదాన్ని ,దానిలో జరిగిన అవినీతిని మళ్ళీ తెరపైకి తీసుకురావాలని వైసీపీ చూస్తుందట . ఇదే జరిగితే లోకేష్ మాత్రమే కాదు మిగతా టీడీపీ నాయకుల్లో కూడా టెన్షన్ మొదలవడం గ్యారెంటీ అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు .