Shubman Gill | 255 పరుగుల ఆధిక్యంలో భారత్.. రోహిత్, గిల్ సెంచరీలు..

-

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 473 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో భారత్ 255 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) క్రీజులో ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 135/1తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే కెప్టెన్ Rohit Sharma (103), Shubman Gill (110) సెంచరీలు సాధించారు.

- Advertisement -

ఇక కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న దేవదత్ పడిక్కల్(65) అర్ధసెంచరీతో రాణించాడు. మరో బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జడేజా 15, ధ్రువ్ జురెల్ 15 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4 వికెట్లతో విజృంభించగా.. టామ్ హార్ట్ లే 2, జేమ్స్ ఆండర్సన్ 1, బెన్ స్టోక్స్ 1 వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది.

Read Also: ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్‌ విడుదల.. విల్లు ఎక్కుపెట్టిన మంచు విష్ణు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...