Shubman Gill | 255 పరుగుల ఆధిక్యంలో భారత్.. రోహిత్, గిల్ సెంచరీలు..

-

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 473 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో భారత్ 255 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) క్రీజులో ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 135/1తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే కెప్టెన్ Rohit Sharma (103), Shubman Gill (110) సెంచరీలు సాధించారు.

- Advertisement -

ఇక కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న దేవదత్ పడిక్కల్(65) అర్ధసెంచరీతో రాణించాడు. మరో బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జడేజా 15, ధ్రువ్ జురెల్ 15 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4 వికెట్లతో విజృంభించగా.. టామ్ హార్ట్ లే 2, జేమ్స్ ఆండర్సన్ 1, బెన్ స్టోక్స్ 1 వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది.

Read Also: ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్‌ విడుదల.. విల్లు ఎక్కుపెట్టిన మంచు విష్ణు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...