ఇకపై భయమంటే ఏంటో ప్రభుత్వానికి చూపిస్తా: బండి సంజయ్

-

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేపర్‌ లీకేజ్‌ను వ్యవహారంపై సిట్‌తో కాదు సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘నేను లేనప్పుడు సిట్ అధికారులు నా ఇంటికి వచ్చి నోటీసులు అంటించిపోయారు. ఈ రోజు స్వయంగానే నేనే అధికారులను పిలిచి నోటీసులు తీసుకున్నాను. ఈ విషయంపై నా లీగల్ టీమ్ నిర్ణయం తీసుకుంటుంది. సిట్ విచారణతో అసలు దొంగలను కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది’ అని బండి సంజయ్‌(Bandi Sanjay) ఆరోపించారు. పేపర్‌ లీకేజీలో మొదట ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పిన కేటీఆర్‌.. ఇప్పుడు 20 మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ.. కేటీఆర్‌ రాజీనామా చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి ఇకపై భయమంటే ఏంటో చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
Read Also: ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం: కేటీఆర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...