అధిష్టానం కీలక నిర్ణయం.. రేపు ఢిల్లీకి బండి సంజయ్

-

బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ అగ్రనేతల మధ్య నెలకొన్న విభేదాలు చక్కబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు పూనుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య పోరు పార్టీకి నష్టం కలిగించవచ్చని హై కమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్(Bandi Sanjay) రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

- Advertisement -

ఢిల్లీ నేతల పిలుపుతో బండి సంజయ్(Bandi Sanjay) రేపు హస్తినకు వెళ్లనున్నారు. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీలోనే ఉన్నారు. పొంగులేటి తో ఈటల, మరికొందరు నేతలు భేటీ అవడం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. వారి భేటీ పై నాకు సమాచారం లేదంటూ బండి చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిచ్చాయి. తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో పరిస్థితి చేయిదాటకుండా వాటిని తొలగించడానికి అధిష్టానం స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం.

Read Also: నాకు అలాంటి భర్తే కావాలి – హీరోయిన్ కృతి శెట్టి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...