TSPSC చైర్మన్‌కు తెలియకుండా పేపర్ లీకవుతుందా?: బండి సంజయ్

-

Bandi Sanjay | TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం చంచల్ గూడ జైల్లో ఉన్న బీజేవైఎం నాయకులను బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. టీఎస్ పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదేనని, దానికి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేటీఆర్‌ను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేయాలని అన్నారు.

- Advertisement -

గతంలో ఎవరు తప్పు చేసినా శిక్షిస్తానన్న కేసీఆర్ కుటుంబసభ్యులు తప్పు చేస్తే ఎందుకు వెనకేసుకొస్తున్నాడని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలో లక్షలాది యువత తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పేపర్ లీకేజీ ఎట్లా అయ్యిందని, టీఎస్ పీఎస్సీ చైర్మన్‌కు తెలియకుండా ఎలా అవుతుందని బండి సంజయ్(Bandi Sanjay) అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Read Also: కవిత అరెస్టయితే తీవ్ర పరిణామాలే!

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...