‘మోడీ సభకు వస్తే కేసీఆర్‌కు గజమాలతో సన్మానం చేస్తా’

-

ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగంగా ఆహ్వానించారు. సభకు కేసీఆర్ వచ్చి.. రాష్ట్ర సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ది కావాలా..? లేక రాజకీయాలు కావాలో తెల్చుకోవాలని సవాల్​విసిరారు. తెలంగాణలో అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాన మంత్రి వస్తుంటే అడ్డుకోవాలని పిలుపునిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్​తెలంగాణ వాదే కాదని అన్నారు.

- Advertisement -

తెలంగాణ అభివృద్దికి మోడీ వస్తుంటే.. తెలంగాణ అభివృద్ధికి మోడీ(Modi) సహకరిస్తుంటే అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాదని సంజయ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఏమైనా చిత్తశుద్ధి ఉంటే రేపు తెలంగాణలో జరిగే మోడీ సమావేశానికి హాజరుకావాలని అన్నారు. మోడీ సమావేశానికి వస్తే మోడీతో కేసీఆర్‌(KCR)కు గజమాల వేసి సన్మానం చేయిస్తానని సంజయ్(Bandi Sanjay) అన్నారు. కేసీఆర్ కంపెనీలు మూసి వేస్తే మోడీ తెరిపిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

Read Also: ‘బాలింతలను పొట్టన పెట్టుకోవడమే అభివృద్ధా?’

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...