IPL జట్లకు అలర్ట్..ఈ విదేశీ స్టార్స్ దూరం!

Alert for IPL teams..these foreign stars are far away!

0
40

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి.  మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. గత సీజన్​లో​ ఛాంపియన్స్​గా నిలిచిన చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​గా ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

అయితే ఈ లీగ్ లో విదేశీ ఆటగాళ్ల ప్రభావం  చెప్పుకోవాలి. అందుకే వారిని జట్టు సభ్యలలో పరిధిని పెట్టారు. దీనితో విదేశీ ఆటగాళ్లను కోట్లు కుమ్మరించి మరి కొనుక్కున్నాయి. కానీ వారు నిలకడగా రాణిస్తారో లేదో చూడాలి. ఈ టోర్నీలో కొందరు విదేశీ ఆటగాళ్లు గాయం కారణంగా తప్పుకోగా.. మరికొందరు వారి దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఐపీఎల్​ తొలివారానికి దూరం కానున్నారు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్​ ప్రారంభ వారంలో పాల్గొనట్లేదు. ఆరోన్​ ఫించ్​, ప్యాట్​ కమిన్స్​, గ్లెన్​ మ్యాక్స్​వెల్​, హెజిల్​వుడ్​, మార్కస్ స్టోయినిస్​ తొలి వారం ఐపీఎల్​ మ్యాచులకు దూరం కానున్నారు. కైల్​ మేయర్స్​, అల్జారీ జోసెఫ్​, జానీ బెయిర్​స్టో.. ఐపీఎల్​ ఆరంభ వారానికి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఓపెనర్​ జేసన్​ రాయ్ ఐపీఎల్​కు దూరం కాగా​, పేసర్​ మార్క్​ వుడ్​ గాయంతో టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. వీరే కాగా మరికొంతమంది కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నారు.