యాషెస్ సిరీస్​లో మరోసారి కరోనా కలకలం..ఒకరికి పాజిటివ్​ నిర్ధారణ

Corona excitement once again in the Ashes series..a positive confirmation for one

0
38

యాషెస్ సిరీస్​లో భాగంగా అడిలైడ్ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్​ కోసం పనిచేస్తున్న బ్రాడ్​కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలడం ఆటగాళ్లను కలవరపెడుతోంది.

అడిలైడ్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు కోసం పనిచేస్తున్న బ్రాడ్​కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​గా తేలిందని తెలియజేస్తున్నాం. ఈ విషయంలో విచారణ జరిపి అతడికి దగ్గరగా ఉన్నవారిని ఐసోలేషన్​కు పంపించాం. అలాగే ఆ ప్రదేశాన్నంతటినీ శానిటైజ్ చేశాం” అని అడిలైడ్ మైదాన అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్​లో ఉన్న కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్​ ప్యాట్ కమిన్స్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో ఉన్నాడు. ఈ సిరీస్​లో భాగంగా తర్వాతి రెండు మ్యాచ్​లు జరగబోయే సిడ్నీ, మెల్​బోర్న్​లో కేసులు పెరుగుతూ ఉన్నాయి.